క్యాన్సర్ చికిత్సకు హెబ్రీడ్ మెటీరియల్ కనుగొన్న సందీప్ కు డాక్టరేట్

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

క్యాన్సర్ చికిత్స కోసం కొత్త హెబ్రీడ్ నానోమెటీరియల్ను అభివృద్ధి చేసి , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి రామస్వామి సందీప్ పేరాలను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్లోని రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

ఈ పరిశోధనలో , భాభా అణు పరిశోధనా సంస్థ ( బార్క్ ) తో కలిసి సందీప్ క్యాన్సర్ చికిత్స కోసం నూతన హెబ్రీడ్ నానోమెటీరియల్ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు . దీనితో హెప్టర్ థెర్మియా లేదా అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేయడం . శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి విజయవంతంగా ఉపయోగించవచ్చని రుజువు చేశారు .

అంతేగాక , ఈ నానోమెటీరియల్ ద్వారా నకిలీ కరెన్సీని గుర్తించడంతో పాటు నీటివనరులలో హానికరమైన రసాయనాలను కూడా గుర్తించవచ్చని తెలియజేశారు . తద్వారా పర్యావరణానికి కూడా మేలు చేకూర్చేలా ఈ పరిశోధనా ఫలాలను వినియోగించవచ్చన్నారు . సందీప్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *