మనవార్తలు , పటాన్ చెరు:
రక్షిత క్లౌడ్ కంప్యూటింగ్ వాతావరణం కోసం విశ్వసనీయ కంప్యూటింగ్ టెక్నాలజీ’పై పరిశోధన , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరిఫ్ మొహమ్మద్ అబ్దుల్ను డాక్టరేట్ వరించింది . ఒరిస్సా , సంబల్పూర్ విశ్వవిద్యాలయంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ సుదర్శన్ జేనా , హెదరాబాద్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ ప్రొఫెసర్ ఎం.బాలరాజులు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ పరిశోధనలో విశ్వసనీయత , పాత్ర – ఆధారిత ప్రవేశ నియంత్రణ ద్వారా వినియోగదారుల హానికరమైన కార్యకలాపాలను తగ్గించడంతో పాటు కంప్యూటింగ్ ఖచ్చితత్వం , సామర్థ్యాన్ని మెరుగుపరచినట్టు తెలిపారు .
తద్వారా భద్రత , సమర్థమైన కంప్యూటింగ్ను చేర్చడం ద్వారా మొబెల్ క్లౌడ్ కంప్యూటింగ్ విశ్వసనీయ వాతావరణాన్ని అమలుచేసి ప్రధాన ఫలితాలను సాధించామన్నారు . పట్టా ఆరిఫ్ మొహమ్మద్ అబ్దుల్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం జెఎన్టీయూ హైదరాబాద్ నుంచి పీహెచ్ సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .