శేరిలింగంపల్లి:
సామాజిక కార్యకర్త అయిన మధుకర్ 4వ వర్ధంతి సందర్బంగా విబిసిసి క్లబ్ తరుపున బయ్యారపు రోజా ,సునీల్ దంపతులు సంకల్ఫ్ అనాధ ఆశ్రమంలో పాఠ్య పుస్తకాలు ,పెన్నులు,తినిబండరాలను అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 40 మంది బాలబాలికలకు అందచేశారు .ఈ సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులు VBCC క్లబ్ ని ప్రత్యేకంగా అభినందించి ,ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టి పేద విద్యార్థులకు మరి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
అదే విధంగా ఆశ్రమంలో సమస్యలని విబిసిసి దృష్టికి తీసుకువచ్చారు,వెంటనే స్పందించిన విబిసిసి యాజమాన్యం నగదు రూపేణా నిర్వహుకులకు అందచేశారు .ఇందుకు నిర్వాహకులు ,బాలబాలికలు హర్షం వ్యక్తం చేశారు .కార్యక్రమంలో ఆనంద్,ప్రదీప్, సుమన్, జాక్సన్, సంజయ్ పాల్గొన్నారు..