politics

కీర్తిశేషులు జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థం సాయి త్రిశూల్ సేవా సమితి ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ

మనవార్తలు , పటాన్ చెరు

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ లో వివేకానంద కాలనీలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి జ్ఞాపకార్థం సాయి త్రిశూల్ సేవా సమితి ఆధ్వర్యంలో వంద మైనార్టీ కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ తోఫా ను  సాయి త్రిశూల్ సేవా సమితి నాయకులు సునీల్ రెడ్డి కానుకగా అందించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు, రంజాన్ మాసం తమకెంతో పవిత్రమైంది అని రంజాన్ మాసంలో సర్వ మానవాళి క్షేమం కోసం ప్రార్థనలు చేయాలని అయితే పండుగల వేళ నిరుపేద ప్రజానీకం నూతన వస్త్రాలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడం గుర్తించి సాయి త్రిశూల్ సేవా సమితి వారు రంజాన్ తోఫాను అందించామని రంజాన్ పండుగ సందర్భంగా ప్రార్థనలు చేయాలని ఆయన ముస్లిం సోదరులకు సూచించారు. ఈ పండుగను సోదరభావంతో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సాయి త్రిశూల్ సేవా సమితి నాయకులు సునీల్ రెడ్డి తెలిపారు

ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ముస్లిం మహిళా సోదరి మాట్లాడుతూ మాకు జైపాల్ రెడ్డి అన్న లేని లోటుని సునీల్ రెడ్డి అన్న తీరుస్తున్నాడు అని అన్నారు. అన్నగారికి మేము ఎప్పుడు మా తరపున రుణపడి ఉంటామని మరియు సునీల్ రెడ్డి అన్న గారిని అల్లా చల్లగా చూడాలని వాళ్ల కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నామని అన్నారు.. అలాగే సోదరి మాట్లాడుతూ మా ముస్లిం కుటుంబాలకు అనే కాకుండా ఎవరినైనా సమానంగా చూసిన వ్యక్తి మాకు రంజాన్ పండుగ వచ్చిందంటే ముందుండే వ్యక్తి జైపాల్ రెడ్డి అన్న అని అన్నారు .కీర్తిశేషులు జైపాల్ రెడ్డి అన్న ఈరోజు ఆయన మన మధ్యలో లేనందువలన చాలా భాధగా ఉందని  అల్లా వాళ్ల కుటుంబాన్ని చల్లగా చూడాలని ప్రార్థనలు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సాయి త్రిశూల్ సేవా సమితి నాయకులు ,యువసేన సభ్యులు నాయకులు, దశరథ్, చెన్నంరెడ్డి, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, వెంకట్ గౌడ్, డీను, విక్కీ, కాలనీవాసులు ముస్లిం సోదరా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు,

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

8 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

8 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

8 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

8 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago