62 మంది లబ్ధిదారులకు 62 లక్షల రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజురైన 62 లక్షల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదన్న సమన్నత లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, తహసిల్దార్ పరమేశం, ఎంపిడిఓ బన్సిలాల్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు వెంకట్ రెడ్డి, నారాయణరెడ్డి, రాజ్ కుమార్, కృష్ణ యాదవ్, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అఫ్జల్, అంతిరెడ్డి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *