నిత్యావసర సరుకుల పంపిణీ…
హైదరాబాద్:
ప్రముఖ సంఘసేవకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ బోయిని లక్ష్మయ్య యాదవ్ నాలుగో వర్ధంతి సందర్భంగా హాఫీజ్ పెట్ లోని వారి నివాసం వద్ద 200 కుటుంబాలకు నిత్యవసర సరుకుల్ని బి ఎల్ వై చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బోయిని మహేష్ యాదవ్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం తన తండ్రి పేరుపైన ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా విధ్యా, వైద్యం ఆకలితో ఉన్నవారికి సాయం చేయడం ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ, ఆయన ఆశయ సాధనకు నిరంతరం కొనసాగిస్తామని మహేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ ఇంచార్జ్ బోయిని అనూష యాదవ్ ,బోయిని సులోచన, మల్లేష్, రాజేష్, నవీన్, సాయి, వెంకన్న రాహుల్ తదితరులు పాల్గొన్నారు.