పేదలకు ఉచితంగా మాస్కులు ,శానిటైజర్లు పంపిణీ…
మనవార్తలు, మియాపూర్ :
శేరిలింగంపల్లి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్, ట్రేడ్ యూనియన్ నాయకులు, బాలింగ్ సత్తయ్య గౌడ్ 11 వ వర్ధంతి సందర్భంగా. ఆయన కుమారుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలా ఎన్నో రకాలుగా ప్రజా సేవ చేశారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా , ఆయన చేసిన సేవలను స్మరిస్తూ శనివారం రోజు ఆయన కుమారుడు బాలింగ్ గౌతం గౌడ్ తండ్రి ఆశయాలను తండ్రి లక్ష్యాలను. తండ్రి చేసిన సేవలను కొనసాగిస్తునాడు. గౌతమ్ గౌడ్ కష్టకాలంలో పేద వారిని ఆదుకోవడం తండ్రి వారసత్వ రాజకీయాలను అందిపుచ్చుకొని తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న బాలింగ్ గౌతం గౌడ్ బాలింగ్ సత్తయ్య గౌడ్ 11వ వర్ధంతి ని పురస్కరించుకుని మరొకసారి వారిని స్మరించుకుంటూ
11వ వర్ధంతి సందర్భంగా బాలింగ్ సత్తయ్య గౌడ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ మరియు హఫిజ్ పెట్ 109 డివిజన్ తెరాస అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్ పేదలకు, పారిశ్యుధ్య కార్మికులకు ఉచితంగా మాస్క్ లు మరియు శానిటైజర్ లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపాడు.
