ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన ధీశాలి స్వర్గీయ ఇందిరా గాంధీ

politics

సంక్షేమం, అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన 

ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ పాలన

నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రపంచ దేశాలలో ఉక్కు మహిళాగా మాత్రమే కాకుండా తన పాలన దక్షతతో పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని చిట్కూల్ లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయాంలో పేదలకు ఆమె అందించిన సంక్షేమాని స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ పేదలకు సంక్షేమం, అభివృద్ధి ని దగ్గరికి చేసి భారతీయుల గుండెలో పదిలంగా నిలిచిపోయారని తెలిపారు. ఆనాడు ఆ మహానేత ముందు చూపుతో చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితంగా దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. ఇందిరమ్మ పాలన స్ఫూర్తితో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందిస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *