నడిగడ్డ తాండ వాసులకు మద్దతుగా ధర్నా

Hyderabad politics Telangana

హైద్రాబాద్:

మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ లో సిఆర్పిఎఫ్ క్యాంపస్ వద్ద నడిగడ్డ తాండ మరియు సుభాష్ చంద్రబోస్ లో నివసిస్తున్న ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న సిఆర్పిఎఫ్, రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులను వారి హక్కుల గురించి ప్రశ్నిస్తూ ధర్నా చేయడం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ సమస్య గురించి ఇదివరకే బిజెపి పార్టీ తరఫున ఢిల్లీ వరకు వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. మరియు బీసీ కమిషన్ మెంబర్ ఆచారి ని తాండాకు ఆహ్వానించి వారికి సమస్య పై పూర్తిగా వివరించిన సంగతి గుర్తు చేశారు.

అదేవిధంగా బిజెపి పార్టీ వారికి పూర్తి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గుండ్డే గణేష్ ముదిరాజ్. ఎడ్ల ఆంజనేయులు. చందు రత్నాకర్. జాజిరావు శీను. జి.మల్లేష్.జాజిరావురాము.రవీందర్. రాజేందర్. దుర్గేష్. మరియు స్థానిక బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *