ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ …

politics

పటాన్ చెరు(గుమ్మడిదల):

ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తానని పటాన్ చెరు మాజీ సర్పంచ్ , ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు తెలిపారు.

పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల మండలం వీరారెడ్డి పల్లిలోని ప్రైమరీ స్కూల్‌లో టీవీ సౌకర్యం లేక ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం లేదు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న దేవేందర్ రాజు స్కూల్‌కు పదహారు వేల విలువ చేసి టీవీని అందించారు. పాఠశాలలో చదువుతున్న ముప్పై మంది విద్యార్థులకు టీవీ ద్వారా ఆన్‌లైన్ ద్వారా పాఠాలు వినే అవకాశం కల్గింది.

టీవీ లేక ఇబ్బందులు పడుతున్న తమ పాఠశాలకు కొత్త టీవీని అందించిన ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజుకు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు .ఇక నుంచి ప్రతి రోజు విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా విద్యాభోధన అందించేందుకు కృషి చేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు . గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలను దత్తత తీసుకుని మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు .సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజును పలువురు అభినందించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *