మనవార్తలు ,పటాన్ చెరు:
సృజనాత్మక వేడుకలు ఒత్తిడిని అధిగమించేలా చేస్తాయని , సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయని , అంతిమంగా ఉజ్వల భవతకు బాటలు వేస్తాయని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని అన్వేషణ , కళాకృతి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘ ధోల్ – ఎ – జర్న్ ‘ పేరిట శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు . విభిన్న సాంస్కృతిక , ఉత్సాహ పూరిత అంశాల మేళవింపుతో రూపకల్పన చేసిన ఈ ఒక రోజు కార్యక్రమాన్ని ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్యలు లాంఛనంగా ప్రారంభించారు .
రోజువారీ కార్యకలాపాలకు భిన్నంగా నిర్వహించే ఇటువంటి సాంస్కృతిక పోటీలలో పాల్గొనడం వల్ల ఒక రకమైన సుహృద్భావ వాతావరణం వెల్లివిరుస్తుందని , కొత్త అనుబంధాలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడ్డారు . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలు వెలికితీసే వేదికలుగా సాంస్కృతికోత్సవాలు తోడ్పడతాయని , మెత్రీభావవను పెంపొందించి , బృందాలు కలిసి పనిచేసే సంస్కృతికి బాటలు వేస్తాయని డెరైక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లెఫ్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ అన్నారు .
ఈ ఒకరోజు వేడుకలలో భాగంగా దాండియా , బతుకమ్మ , పలు సాంస్కృతిక కార్యక్రమాలు , ఫుడ్ స్టాళ్లు , ఫోటోబూత్లు వంటి పలు ఆకట్టుకునే అంశాలను అన్వేషణ , కళాకృతి విద్యార్థులు నిర్వహించారు . గీతం విద్యార్థులంతా ఎంతో ఉత్సాహభరింతగా వాటిలో పాల్గొని తమలో దాగివున్న ప్రతిభను చాటారు .