యాసంగి లో పంట మార్పు చేపట్టాలి

Districts Hyderabad Telangana

మునిపల్లి 

యాసంగి పంటసాగులో పంట మార్పు చేపట్టాలని రాయికోడ్ ఎడిఏ హరిత రైతులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికలో మునిపల్లి క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ రైతులు ఎల్లప్పుడూ ఒకే రకమైన పంట సాగు చేయకుండా పలు రకాల పంటలు పండించలన్నారు. నీటి ఆధారిత పంటలను పండించేందుకు ఆసక్తి కనబరిచి పప్పు దినుసులు, నూనె గింజలు తదితర పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పంటలను సాగు చేయడం వలన మిశ్రమ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో శివకుమార్,ఏఈఓ సంగీత,సర్పంచ్ రమేశ్, ఉప సర్పంచ్ సలవోదిన్ , టిఆర్ఎస్ నాయకులు గారిబోధిన్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *