Telangana

కరోనా వ్యాప్తిని ద్రవాల భౌతికశాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చు !…

– గీతం కార్యశాలలో సెన్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి

మనవార్తలు ,పఠాన్ చెరు:

కరోనా మహమ్మారి ఎలా కదులుతుంది , ఎలా వ్యాపిస్తుంది , దానికి ఎలా కళ్ళెం వేయగలిగాం వంటివన్నీ ద్రవాల భౌతిక శాస్త్రం ద్వారా కనిపెట్టొచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.ఎన్ . చెప్పారు . గీతం గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి 30 వ తేదీ వరకు ‘ ద్రవాల భౌతిక శాస్త్రం : పద్ధతులు , వినియోగం ‘ ( ఫిజిక్స్ ఆఫ్ ఫ్యూయిడ్స్ : మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ ) అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల కార్యశాల మంగళవారం ప్రారంభమైంది . ఇందులో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , ద్రవాల భౌతిక శాస్త్రం అంతర్ విభాగ పాఠ్యాంశమని , ఇది చాలా విస్తృతమైనదని , రసాయన , జీవ శాస్త్రాలతో పాటు మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ముడిపడి ఉంటుందన్నారు .

ఈ మూడు రోజుల కార్యశాల ముగిసే సమయానికి సదస్యులంతా వాటిని ఎలా ఉపయోగించాలి అనే దానిపై మంచి అవగాహన ఏర్పరచుకోగలరని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు . ఐఐటీ ఖరగ్పూర్లోని ఫ్యాకల్టీ ఆఫ్ సెన్సైస్ డీన్ ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్ ఈ వర్క్షాపు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు . ‘ ద్రవ ప్రవాహానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు ‘ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు . ఆ తరువాత గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రెజా ‘ బౌండరీ లేయర్ థియరీ ‘ అనే అంశంపై కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వంశీకృష్ణ నార్ల ‘ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రిలేషన్స్ ‘ అనే అంశాలపై ప్రసంగించారు . కార్యశాల నిర్వాహకుడు ప్రొఫెసర్ కె.ఎం.ప్రసాద్ మాట్లాడుతూ , ముఖాముఖి వివరణ , సాఫ్ట్వేర్ వినియోగం వంటి కార్యక్రమాల ద్వారా ఇందులో పాల్గొనేవారికి శిక్షణ ఇవ్వడం ఈ వర్క్షాప్ ప్రత్యేకతగా అభివర్ణించారు . విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జీఏ రామారావు , పలువురు అధ్యాపకులు , పరిశోధక విద్యార్థులు తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

17 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

18 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago