30 లక్షల రూపాయల సొంత నిధులతో యువజన సంఘం భవన నిర్మాణం

politics Telangana

_యువత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

_పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

యువత చెడు వ్యసనాలతో పెడదారి పట్టకుండా, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తిలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన గోనెమ్మ యూత్ అసోసియేషన్ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువత అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. విద్యారంగం తో పాటు క్రీడల్లో రాణిస్తున్న యువతకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రాజు, నాయకులు, పుర పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *