మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గస్థాయి మహిళా క్రీడా పోటీలు

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

రాబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వచ్చే నెల 6, 7 తేదీలలో పటాన్చెరువు పట్టణంలో నియోజకవర్గస్థాయి మహిళల క్రీడా పోటీలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం క్రీడా పోటీలు నిర్వహించనున్న మైత్రి క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగినులు, మహిళా ప్రజాప్రతినిధులు కోసం క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 8వ తేదీన జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో మహిళా దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

భారీ స్థాయిలో నిర్వహించనున్న కార్యక్రమాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ సతీమణి మెట్టు రమాదేవి కుమార్ యాదవ్, గూడెం కల్పనా మధుసూదన్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఎంఈఓ రాథోడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *