పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని సందర్భంగా పటాన్ చేరు నియోజవర్గం పాశమైలారం గ్రామ పరిధిలోని ఛత్రపతి శివాజీ యువసేన వారి అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారుఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అజేయమైన స్ఫూర్తి, ధైర్యం మరియు తన ప్రజల పట్ల నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు.శివాజీ మహారాజ్ గారి ప్రతిభ యుద్ధంలోనే కాదు, పరిపాలనలోనూ ఉందని,ఆయన సమర్థవంతమైన పాలనను స్థాపించాడు, ఆదాయ సేకరణలో సంస్కరణలను అమలు చేశాడు, మరియు క్రమశిక్షణ కలిగిన సైనిక నిర్మాణాన్ని నిర్వహించాడని తెలిపారు. గొప్ప పరిపాలకుడిగా , ఉదార పౌర పాలన స్థాపకుడిగా కీర్తిని పొందారని చెప్పారు . ఆయన గాథలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు .ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి,వీరేష్ గౌడ్,సంతోష్,బుమేష్,వినోద్,వేణుగోపాల్,మరియు శివాజీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…