నేరాల అదుపునకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు

Hyderabad politics Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో నూతనoగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం రాజరాజేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సై వెంకట్ రెడ్డి లతో కల్సి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ సి సి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ధాతలకు అభినందలు తెలిపారు. వీరి ని ఆదర్శంగా తీసుకుని మిగతా కాలనీ వారు ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కృష్ణ,వైస్ ప్రెసిడెంట్ మధు ముదిరాజ్, యూత్ ప్రెసిడెంట్ విజయ్ సింగ్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ హరికృష్ణ రాయుడు, కాలనీ అసోసియేషన్ మెంబర్స్ మద్దిలేటి యాదవ్, సంతోష్ శంకర్, కాంలని వాసులు ఎం ఎస్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, బసవ శంకర్, మోహన్ రావు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 110 కెమెరాలు విలువ 22 లక్షలు ప్రస్తుతం 50 కెమెరాలు 10 లక్షలు ఖర్చు అయినది మిగిలిన 60 కెమెరాల కు 12 లక్షలు త్వరలో మిగిలిన 60 కెమెరాల ఏర్పాటు చేస్తామని కాలనీ వాసులు తెలిపారు.

సి సి కెమెరాల ఏర్పాటు కు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన వెంకట రాజు, భగవాన్ దాస్, రామ్మూర్తి, రామ సుబ్బారెడ్డి మరియు వారి మిత్రులు అందరు కలిసి 10 లక్షల రూపాయలు సహాయం చేసిన వారికి కాలనీ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *