జలమండలి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్
అతి త్వరలో బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్, బీరంగూడ పరిధిలో నూతన రిజర్వాయర్లు, ట్యాంకుల ప్రారంభం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
జలమండలి ఆధ్వర్యంలో ఓ ఆర్ ఆర్ ఫెజ్ 2 పరిధిలో చేపడుతున్న రిజర్వాయర్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిలమండలి అధికారులతో ఎంఎల్ఏ జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల ప్రగతిని ఎంఎల్ఏ కు వివరించారు. ప్రధానంగా బొల్లారం బీరంగూడ అమీన్పూర్ తెల్లాపూర్ పరిధిలో రిజర్వాయర్ల నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. రాబోయే 15 రోజుల్లో పంపింగ్ పనులు సైతం పూర్తి చేసి నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికల సిద్ధం చేసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. కాలుష్య జలాలతో ఇబ్బంది పడుతున్న బొల్లారం మున్సిపల్ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. పైపులైన్ల లీకేజీ విషయంలో త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జలమండలి జిఎం సుబ్బారాయుడు, డీజీఎంలు చంద్రశేఖర్, శివకుమార్, ఏఈలు ప్రవీణ్, పూర్ణేశ్వరి, శ్రీనివాస్, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.