ఎమ్మెల్యే జీఎంఆర్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందజేసిన
పటాన్చెరు శ్రీ కోదండ సీతారామ దేవాలయ కమిటీ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
శ్రీ రామ నవమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శుక్రవారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులకు పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ దంపతులు, ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, తదితరులు పాల్గొన్నారు.