నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తోందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన భోగయ్య కుమారుడు శ్రీనివాస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. చికిత్స కోసం మంజూరైన 2 లక్షల 50వేల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాన్ని ఆదివారం ఎంఎల్ఏ జిఎంఆర్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *