మనవార్తలు ,బొల్లారం
మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల తో కలిసి వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఐ టి యు పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జనవరి 6,2022 నాడు జీవో నెంబర్ 4ను విడుదల చేశారని ప్రస్తుతం ఉన్న జీవితానికి 30 శాతం పెంచారని అని .పెరిగిన వేతనాలు జూన్ 2021 నుండి చెల్లించాలని జీవోలో పొందుపరిచారని అయినా ఇంతవరకు పెరిగిన వేతనాలను కార్మికులకు చెలించలేదని మండి పడ్డారు .పెరిగిన వేతనాలను కార్మికులకు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా 8 నెలలకు సంబంధించిన ఏరియాస్ ను ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.