ప్రభుత్వభూములను ఆక్రమించుకుంటున్న రియల్టర్లపై చర్యలేవి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం మానుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .సంగారెడ్డి జిల్లా పెద్దకంజర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 120,121,125 లలోని భూములను ఆయన పరిశీలించారు . అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దకంజర్ల గ్రామంలో ప్రభుత్వ భూమిని రియల్టర్లు ఆక్రమించున్నారని వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు . ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటున్న జిల్లా అధికారులకు ఎందుకు చోద్యం చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భూ కబ్జాలపై గ్రామంలో గ్రామ సభ నిర్వహించి రైతుల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు . ప్రజా అవసరాల కోసం ఎంతో విలువైన భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం మానుకోవాలన్నారు. రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరని .రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 126 సర్వే నెంబర్ లో 10 ఏకారాల భూమిలో రెడిమిక్స్ పెట్టి ఆక్రమించుకున్నారని అన్నారు.2013 చట్టం ప్రకారం తప్పని పరిస్థితుల్లో రైతులు ఒప్పుకుంటే అమలు చేయాలని ,బహిరంగ మార్కెట్లో ఏకరకు 5 కోట్ల రూపాయల పలుకుతోంది అని అన్నారు. గ్రామ రైతులకు న్యాయం జరిగే వరకు రైతులతో కలిసి పోరాడుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మైసాయ్య,శేఖర్,రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *