యువత స్వయం ఉపాధిని ఎంచుకోవడం హర్షణీయం..
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా స్వయం ఉపాధి వైపు యువత ఆసక్తి కనబర్చడం హర్షణీయమని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
గురువారం పటాన్చెరు పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన టీ టైమ్ స్టోర్ నీ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ జర్నలిస్టు పవన్, రాజ్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.