Districts

ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం మూర్ఖత్వం _బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్

మనవార్తలు , పటాన్ చెరు:

భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసనగా పటాన్ చెరు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నిరసనవ్యక్తం చేశారు. అనంతరం బిఎస్పి నాయకులు తహశీల్ధారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పటాన్ చెరు నియోజకవర్గం బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని ఆర్టికల్ 3ఏ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానిని హేళన చేస్తూ, దానికి తూట్లు పొడుస్తూ, అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు .

కేసిఆర్ రాజ్యాంగం పట్ల కానీ రాజ్యాంగాన్నినిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పడడానికి మూల కారణం రాజ్యాంగం అని అన్నకేసిఆర్ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అని అనడం ఎంతవరకు సమంజసం అని వారు సీఎంను ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు అన్ని రాజ్యాంగాన్ని అది రాసిన అంబేద్కర్ ను గౌరవిస్తూ ఉంటే మొదటగ బీజేపీ పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను బట్టి నీ ఇంట్లో రాజకీయ ఉద్యోగాలు కట్టబెట్టావని ఇటువంటి అంశాలను విమర్శించే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని ధ్వజమెత్తారు భారత జాతికి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో తీవ్రపరిమాణాలను ఎదుర్కొంటారని బిఎస్పి నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పఠాన్ చేరు అసెంబ్లీ అధ్యక్షులు సుంకు వినయ్ కుమార్ ,అసెంబ్లీ ఇంఛార్జ్ సంజీవ ,అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రవీణ్,పఠాన్ చేరు మండల కన్వీనర్ వెంకటేశ్, కర్నె శ్రీధర్,గుమ్మడిదల మండల కన్వీనర్ నీరుడి శివకుమార్, తెల్లపూర్ పీన్సిపాలిటీ అధ్యక్షుడు దర్శన్ ,అమీన్ పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాములు,111 డివిజన్ అధ్యక్షుడు శ్రీశైలం ,113 డివిజన్ అధ్యక్షుడు మహేందర్,ఉపాధ్యక్షుడు బాలు రేవంత్ ,మరియు ప్రెసిడెంట్స్ బాను ,రామకృష్ణ ,కిరణ్ ,సామ్ సన్ మరియు బీఎస్పీ కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

22 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

22 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

22 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago