వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్

politics Telangana

_పెద్దమ్మ గూడెంలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు

జిన్నారం,మనవార్తలు ప్రతినిధి :

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం చౌరస్తాలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడే కాకుండా మంచి పరిపాలనాదక్షుడు అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు అని అన్నారు. తన వీరత్వం తో యువతరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *