_పెద్దమ్మ గూడెంలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు
జిన్నారం,మనవార్తలు ప్రతినిధి :
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం చౌరస్తాలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ గొప్ప పోరాటయోధుడే కాకుండా మంచి పరిపాలనాదక్షుడు అని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడు అని అన్నారు. తన వీరత్వం తో యువతరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు.