మనవార్తలు ,పటాన్చెరు
విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందనీ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రం రెడ్డి అన్నారు. టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ విద్య ద్వారానే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజంలోని రుగ్మతల పై పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ సోషల్ సర్వీస్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, తారా సింగ్, సోహెల్, సంస్థ ప్రతినిధులు ఫసి, ఫైజాన్, ఇలియాస్, ఇమ్రాన్, జైకుద్దిన్, తదితరుల పాల్గొన్నారు