ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా చంద్రశేఖర్

Districts politics Telangana

_అభినందించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు :

పటాన్ చెరు డివిజన్ బండ్లగూడ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ ను ఎస్సీ, ఎస్టీ జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్  కమిటీ సభ్యుడిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం పటాన్ చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే జిఎంఆర్ గారికి రుణపడి ఉంటానని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎస్సీ ఎస్టీల పై దాడులు నిరోధించడం తో పాటు, వారి సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, వెంకటేష్, శ్రీ రాములు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *