చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

politics Telangana

నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని చిట్కుల్ లో ని ఐలమ్మ కాంస్య విగ్రహం వద్ద పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. నిజాం రజాకార్ల నిరంకుశ పాలనలో వెట్టి చాకిరితో మగ్గిపోయిన బతుకులను బాగు చేయడానికి, బడుగు జీవుల అస్థిత్వాన్ని పరిరక్షించడానికి బందుకులు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. ఆనాడు ఆమె చేపట్టిన ఉద్యమం అణచివేతను ప్రశ్నించేలా ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చిందన్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో దేశంలోనే అతి పెద్ద కాంస్య విగ్రహాన్ని చిట్కుల్ గ్రామంలో ప్రతిష్టించామని ఆయన గుర్తు చేశారు.అదే ఐలమ్మ పోరాట పటిమ, ధైర్యాన్ని ఆసరాగా చేసుకుని తాను సైతం ముందుకు వెళ్తున్నానని తెలిపారు. ఆమె స్పూర్తితో సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసమే తాను ఎల్లప్పుడూ కృషి చేస్తూ స్వచ్చంధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని వెల్లడించారు. ప్రజలే తన కుటుంబంగా ముందుకు వెళ్తూ వారి ఆధారభిమానాలతో మరింత సేవ చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మన రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాకలి వెంకటేష్, మాజి సర్పంచ్ సుంకరి రవీందర్, మాజి ఉప సర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి,వి నారాయణ రెడ్డి,పొట్టి నారాయణ రెడ్డి, కృష్ణ,మురళీ,వెంకటేశ్, సత్యా నారాయణ,బాబు, కిషోర్, రజక సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *