నీలం మధు ముదిరాజ్ ను సన్మానిస్తున్న చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం

నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తి దాత

politics Telangana

_చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం

మనవార్తలు ,పటాన్ చెరు:

నేటి యువతకు చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమని చాకలి ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎత్తైన చిట్యాల (చాకలి) ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం చిట్కుల్ గ్రామంలో విగ్రహ దాత నీలం మధు ముదిరాజ్ ను రాష్ట్ర రజక సంఘం నేతలతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరుగని ధైర్యసాహసాలను ప్రదర్శించిన చాకలి ఐలమ్మ స్ఫూర్తిని నింపుతూ ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రజకుల తరపున మధుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి జీతయ్య, చిట్కుల్ వెంకటేశ్, సత్తయ్య, ఆంజనేయులు, సురేష్ లతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *