Districts

కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు

తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలతో పాటు అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపాలిటీ లు, రామచంద్రపురం, భారతి నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు దేశానికి దిక్సూచి గా మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశవ్యాప్తంగా అందరిచేత ప్రశంసలు అందుకున్న కారణజన్ముడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని కొనియాడారు. 8 ఏళ్ల పాలనలో అట్టడుగు వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. ఇంటి ముంగట అభివృద్ధి ఇంటిలో సంక్షేమం అన్న చందంగా కెసిఆర్ గారి పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్వన్ గా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మూడు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

పటాన్చెరు డివిజన్ పరిధిలో..

పటాన్చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. అనంతరం హజరత్ నిజాముద్దీన్ దర్గాలో ప్రార్థనలు, చద్దర్ సమర్పించారు. ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డు ఆవరణలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కేసీఆర్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టణంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో నిరు పేదలకు అన్నదానం నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్జల్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago