ఎన్నికల్లో పెరుగుతున్న కన్సల్టెన్సీల ప్రభావం

గీతం చర్చాగోష్ఠిలో వక్తల అభిప్రాయం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మన దేశ ఎన్నికల ప్రచారంలో రాజకీయ కన్సల్టెన్సీల ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉందని ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ‘భారతదేశంలో ఎన్నికల ప్రచారాలు – పెరుగుతున్న రాజకీయ సలహాదారుల పాత్ర’ అనే అంశంపై శుక్రవారం ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ కైలాష్ కున్హి […]

Continue Reading

యోగా ద్వారా మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని, యోగా మన మనస్సునే కాదు. శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ముదిరాజ్ భవన్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5వ రాష్ట్రస్థాయి యోగ పోటీలను శుక్రవారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఆరోగ్యాన్ని పొందడం, […]

Continue Reading

మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

దివ్యాంగుడికి ఎమ్మెల్యే జిఎంఆర్ చేయూత సొంత నిధులతో ఆటో అందజేత పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయి వెన్నుపూస గాయంతో ఉపాధి లేక.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడికి అండగా నిలిచారు. సొంత నిధులతో ఆటో అందించి తన ఉదారతను చాటుకున్నారు.గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. […]

Continue Reading

కలశ యాత్రలో పాల్గొన్న కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులు

బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గురువారం బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు భక్తిశ్రద్ధలతో కలశ యాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి దంపతులు ముఖ్యఅతిథిగా హాజరై కలశ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక దుర్గామాత ఆలయంలో చంద్రారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన మహిళలు అత్యంత […]

Continue Reading

కళాత్మకతకు సాంకేతికతను జోడించండి

స్కెచింగ్ కార్యశాలలో ఆర్కిటెక్చర్ విద్యార్థులకు శిక్షకుల సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఆర్కిటెక్చర్ విద్యార్థులలో నిబిడీక`తంగా ఉన్న కళాత్మకతకు సాంకేతికతను జోడిస్తే అటు ఖచ్చితత్వాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, ఇటు వారి సృజనాత్మక ఆలోచనలను మరింత పెంపొందించుకోవచ్చని శిక్షకురాలు సానియా షర్పున్నీసా అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో రెండు రోజుల స్కెచింగ్ కార్యశాలను నిర్వహించారు. ఆర్కిటెక్చరల్ డిజైన్ రంగంలో కీలకమైన దృక్పథం, షేడింగ్, నిష్పత్తులతో సహా అవసరమైన స్కెచింగ్ టెక్నిక్ లపై లోతైన అవగాహన […]

Continue Reading

ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ 155వ జయంతి వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని ఏకే ఫౌండేషన్ చైర్మన్ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని , రామచంద్రపురం డివిజన్ గాజుల బాబు చౌరస్తా మెయిన్ షాపింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి, ప్రపంచానికి […]

Continue Reading

తాగి మరియు ఫోను మాట్లాడుతూ వాహనాలు నడపరాదు_ పటాన్ చెరు సిఐ ప్రవీణ్ రెడ్డి

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ట్రాన్స్ పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య పటాన్ చెరు  డిసిఎం డ్రైవర్ల సమావేశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తాగడం, ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదని, కచ్చితంగా డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని పటాన్ చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు.బుధవారం పటాన్ చెరు డిసిఎం వర్కర్స్ యూనియన్( సిఐటియు)ఆధ్వర్యంలో జరిగిన పట్టణ డీసీఎం డ్రైవర్ల సమావేశం లో […]

Continue Reading

అహింసతో భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు బాపూజీ : నీలం మధు ముదిరాజ్

చిట్కుల్లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అహింస సిద్ధాంతమే ఆయుధంగా ఆంగ్లేయుల కబంధహస్తాల నుంచి భారత దేశ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ అని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మహాత్మ గాంధీ 155వ జయంతిని పురస్కరించుకొని పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నీలం మధు ముదిరాజ్ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా […]

Continue Reading

మహాత్మా నీవు చూపిన బాటలో నడుస్తాం _మాదిరి ప్రిథ్వీ రాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మహాత్ముడు చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని ఎండీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్, బీఆర్ఎస్ యువ నాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్ అన్నారు.గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంతో పాటు అల్విన్ కాలనీ లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి మాదిరి ప్రిథ్వీరాజ్ మహాత్ముడి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాదిరి ప్రిథ్వీ రాజ్ […]

Continue Reading

ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని గాంధీ థీమ్ పార్క్ లో గల మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన […]

Continue Reading