గ్రామీణ జాతరలలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర, రుద్రారం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి […]

Continue Reading

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మల్లన్న స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతు జాతరలు ఉత్సవాలు తెలంగాణ […]

Continue Reading

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతినీ పురస్కరించుకొని గురువారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని […]

Continue Reading

స్వామి వివేకానంద గొప్ప తత్వ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి

యువతకు స్వామి వివేకానంద చూపిన మార్గం అనుసరణీయం : నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో ఘనంగా స్వామి వివేకానంద జయంతి  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేటి యువత స్వామి వివేకానందను చూసి నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఎంతో ఉందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా చిట్కుల్ లోని ZPHS స్కూల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ […]

Continue Reading

రాష్ట్ర ప్రజలందరి పై శ్రీ వారి ఆశీస్సులుండాలి  నీలం మధు ముదిరాజ్ 

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో వర్ధిల్లాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా శ్రీ రంగాపురం మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారితో కలిసి ఉత్తర ద్వారం ద్వారా రంగ నాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఘన స్వాగతం […]

Continue Reading

వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుని..ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అనంతరం జేపీ కాలనీలో.. సీసాల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవంలో […]

Continue Reading

పోరాటయోధుడు పండగ సాయన్న నీలం మధు ముదిరాజ్

భూస్వాములకు రజాకర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మర్చిపోలేనిది  ఆయన స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం  సొంత నిధులతో పండగ సాయన్న విగ్రహం  రాయిని పల్లి లో విగ్రహావిష్కరణ కార్యక్రమం భారీ బైక్ ర్యాలీ,మంగళ హారతులతో స్వాగతం పలికిన గ్రామస్థులు  తెనుగోలా సాయన్న ను ఊరూరా ప్రతిష్టించి తెలంగాణ సాయన్నగా తీర్చిదిద్దుదాం  పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : నిజాం రజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పేద ప్రజల కడుపు నింపిన పోరాటయోధుడు పండగ సాయన్న అని నీలం మధు ముదిరాజ్ […]

Continue Reading

గీతంలో ఉత్సాహభరితంగా సంక్రాంతి సంబరాలు

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు, ఎద్దుల బండి, చెరకు రసం, సంప్రదాయ అరిటాకు భోజనం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో శుక్రవారం వార్షిక పంటల పండుగ అయిన మకర సంక్రాంతి ఉత్సవాలను ఉత్సాహభరితంగా, ఆనందంగా నిర్వహించారు. గీతంలోని ఆతిథ్య విభాగం, స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమం మన దేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తూ, విద్యార్థులలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలితీయడం లక్ష్యంగా సాగింది. ఉత్సాహభరితమైన అలంకరణలు, సాంప్రదాయ […]

Continue Reading

ఇస్నాపూర్ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మత్స్యకారుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, మత్స్యకారుల సొసైటీలో నూతన సభ్యత్వానికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఇస్నాపూర్ మత్స్యకార సహకార సంఘం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని వివిధ చెరువుల పరిధిలోగల మత్స్యకార సహకార సంఘంలో నూతన […]

Continue Reading

ఏకాగ్రతతో ఏదైనా సాధించగలం

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన స్పిక్ మాకే వ్యవస్థాపకుడు డాక్టర్ కిరణ్ సేథ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఏకాగ్రతతో సాధన చేస్తే ఎటువంటి లక్ష్యాలనైనా సులువుగా సాధించవచ్చునని, మనకు వారసత్వంగా సంక్రమించిన ఉచ్ఛాస, నిశ్ఛాస పద్ధతులను రోజువారీ, అంతరాయం లేకుండా ఆచరించాలని స్పిక్ మాకే వ్యవస్థాపకుడు, ఐఐటీ ఢిల్లీ పూర్వ ఆచార్యుడు డాక్టర్ కిరణ్ సేథ్ గీతం విద్యార్థులకు ఉద్బోధించారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఆధ్వర్యంలో ‘వారసత్వ ప్రతిధ్వనులు’పై గురువారం జ్జానోదయ ప్రసంగం చేశారు. ఆధునిక […]

Continue Reading