గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి : భైక్ పై వెళ్తున్న యువకున్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా, రెగోడ్ మండలం, ప్యారారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ విట్ఠల్, జయమ్మ ల పెద్దకుమారుడు ప్రేమ్ కుమార్ (25), ఎస్.ఎన్ కాలని,రామచంద్రాపురంలో నివసిస్తూ బైక్ షో రూమ్ లో సేల్స్ ఎగ్జ్ క్యూటివ్ గా పనిచేస్తున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి […]

Continue Reading

ప్రీ ఆర్టీసీ క్యాంపుకు గీతం విద్యార్థి ఎంపిక….

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్యపత్లో నిర్వహించే కవాతులో పాల్గొనే వారిని ఎంపిక చేయడానికి నిర్వహించే ముందస్తు క్యాంపుకు హెదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి గౌరంగో జెనా ఎంపికయ్యారు . గుజరాత్లోని ఆనంద్ జిల్లా సర్దార్ పటేల్ విశ్వవిద్యాలయంలో ఈనెల 20-28వ తేదీ వరకు జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) ఆధ్వర్యంలో నిర్వహించే ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్లో […]

Continue Reading

విద్యార్థులకు నోట్ బుక్కుల పంపిణీ

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  విద్యార్థులు బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలని బీజేపీ నేతలు అన్నారు. సోమవారం రోజు హఫీజ్ పేట్ లో హఫీజ్ పేట్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ బోయిని అనూష మహేష్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా హఫీజ్ పెట్ లోని ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు భోజన సదుపాయం మరియు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ, మరియు మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు […]

Continue Reading

మునుగోడు ఉపఎన్నిక విజయం బిజెపికి చెంపపెట్టు లాంటిది

_కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ _పటాన్చెరులో ఘనంగా సంబురాలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారబోతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో ముఖ్య భూమిక పోషించనున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించిన సందర్భంగా పటాన్చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు […]

Continue Reading

రోగుల రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలి: జిల్లా న్యాయమూర్తి ఎస్. శశిధర్ రెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ఆసుపత్రిలో చికిత్స పొందే రోగుల రికార్డులు సక్రమంగా నిర్వర్తించాలని, ఫలితంగా కొన్ని న్యాయపరమైన చిక్కులు నెలకొన్న సందర్భాలలో ఈ రికార్డులే కీలకమవుతాయని ఎస్.శశిధర్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, పాన్ ఇండియా సంయుక్త న్యాయ అవగాహన కార్యక్రమంలో బాగంగా శనివారం చిట్కుల్ మహేశ్వర మెడికల్ కళాశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జిల్లా న్యాయమూర్తి ఎస్.శశిధర్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్ లు […]

Continue Reading

నిరుపేద యువతి వివాహానికి ఏకే ఫౌండేషన్ ఆర్థిక సహాయం

రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి : ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఏకే ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందువుంటుదని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సయ్యద్ గౌస్ అహమ్మద్ రోజు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా కుమారై సానియాకు కొద్ది రోజుల క్రిందట వివాహం నిశ్చయం కాగా చేతులు డబ్బులు లేకపోవడంతో సయ్యద్ గౌస్ అహ్మద్ ఆర్థిక సహాయం కోసం ఏకే […]

Continue Reading

నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్

_లక్ష లక్షల రూపాయల ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన శేకర్ గత కొద్దిరోజుల క్రితం రెండు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకుల ద్వారా సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్నారు. […]

Continue Reading

గీతం హెదరాబాద్లో ఎం.ఫార్మశీ అడ్మిషన్లు…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ( ఎస్వోపీ ) లో ఈ విద్యా సంవత్సరం ( 2022-23 ) నుంచి ఎం.ఫార్మశీ కోర్సుల నిర్వహణకు ఫార్మశీ కౌన్సిల్ అనుమతి ఇచ్చినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ తెలిపారు . ఫార్మాస్యూటిక్స్ , ఫార్మాసూటికల్ అనాలిసిస్ వంటి ఎం.ఫార్మశీ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ఎం.ఫార్మ్లో ప్రవేశాల కోసం గీతం నిర్వహించే […]

Continue Reading

ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ టీమ్ కు ఎంపికైన తెలుగు తేజాలు

  శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : : ఇంటర్నేషనల్ వాలీబాల్, మరియ బీచ్ వాలీబాల్ ప్లేయర్స్ అయిన భేల్ జ్యోతి విద్యాలయా హై స్కూల్ పూర్వ విద్యార్థి అయిన కృష్ణం రాజు, మరియు నరేష్ లు కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ జి ఎస్ టి లో ఇన్స్ పెక్టర్లు గా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుండి వాలీబాల్, బీచ్ వాలీబాల్ క్రీడపై దృష్టి పెట్టి నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఎన్నో […]

Continue Reading

నమ్ముకున్న కార్యకర్తకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఆపరేషన్ కోసం లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సహాయం పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : తనను నమ్ముకున్న కార్యకర్తలకు, మద్దతుదారులకు కష్టనష్టాల్లో అనునిత్యం అండగా నిలుస్తూ నేటితరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.పటాన్చెరు పట్టణానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాహెర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నడుము కింది భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు, […]

Continue Reading