మనవార్తలు ,హైదరాబాద్:
విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే ధ్వేయంగా కేరీర్ పాయింట్ ముందుకు వెళ్తుందని సంస్థ అకాడమిక్ డైరెక్టర్ శైలేంద్ర మహేశ్వరీ అన్నారు .హైదరాబాద్ శిల్పకళావేదికలో కేరీర్ పాయింట్ ఫెస్ట్ 2023 పేరుతో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు కేరీర్ పాయింట్ శిక్షణ అందిస్తుందని…
తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. ఫ్రెషర్స్ డే వేడుకలను మొదటి సారిగా హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించామని భవిష్యత్ లో మిగతా రాష్ట్రాల్లో సైతం ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు .విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్ వంటి అంశాలపై పట్టు సాధించాలన్నారు.ఆయా రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కేరీర్ పాయింట్ హైదరాబాద్ డైరెక్టర్స్ ఉదయ్ భాస్కర్,ప్రదీప్ కోట,పీ.వీ రావు,శ్రీదేవితో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .