మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో గలకొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బీ బ్లాక్ కి చెందిన శ్రీమతి పద్మ గౌడ్ గారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా దాని ద్వారా మంజూరైన 51 వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి పి ఎ సి. చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా నిస్తుందని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సాయంని అందిస్తుందని దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో వందలాది కుటుంబాలను సి ఎం ఎఫ్ ద్వారా ఆదుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జిల్లా గణేష్, ప్రసాద్ ,సత్యం గౌడ్,యాదగిరి రెడ్డి, రవి శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
