యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేపట్టాలి…
– బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
పటాన్ చెరు:
రైతు తాను పండించిన పంటను అమ్మడానికి మార్కెట్ తీసుకువెళ్లగా 15 రోజులు గడిచిన కొనుగోలు చేయకపోవడం దారుణమని బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ అన్నారు. సోమవారం తెలంగాణ రైతు గోస పై బిజెపి పోరు దీక్ష లో భాగంగా పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా అదే రేటుకి కొనుగోలు చేయాలని, అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేపట్టాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు రైతుబంధు డబ్బులు వెంటనే వారి ఖాతాలో జమ చేయాలన్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని కొనే సమయంలో క్వింటాలుకు ఆరు నుండి ఏడు కిలోల తాళ్ల పేరుతో తరుగు తీయడం సరికాదన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…