చిన్నారిని చంపిన కసాయి తల్లి, అమ్మమ్మ అరెస్ట్

Crime Hyderabad Telangana

శేరిలింగంపల్లి :

కల్లు తాగుడుగు బానిసై చెడుతిరుగుళ్లు తిరుగుటకు అడ్డువస్తుందని తలిచిన కసాయి తల్లి తన 5 ఏళ్ల కూతురుని దారుణంగా హత్య చేసి, ఆ హత్య ను తాను ఉంటున్న ఇంటి ఓనర్ పై నెట్టాలని చూసిని తల్లిని, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం చందానగర్ లోని శాంతినగర్ లో నివసించే వడ్డే యాదమ్మ కు 13 ఏళ్లక్రితం మీర్ పెట్ కు చెందిన రాము తో వివాహం అయింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ముగ్గురు పిల్లలు కాగా వివిధ కారణాలతో ఇద్దరు అబ్బాయిలు మృతి చెందారు. చీటికీ మాటికి మొగుడితో గొడవ పడడం తో రాము వాళ్ళ ఊరెల్లిపోయాడు.

యాదమ్మ చెడు తురుగుళ్లు తిరుగుతూ కళ్ళు తాగుతూ ఉంటుంది. తన వివాహేతర సంబంధాలకు అడ్డువస్తుందని భావించిన తన 5 ఏళ్ల కూతురు కృష్ణవేణి ని దారుణంగా చంపేసింది. తర్వాత తన ఇంటికి వచ్చిన తల్లి తిమ్మమ్మ లు కల్సి ఆ హత్య నేరాన్ని వాళ్ళ ఇంటి ఓనర్ పై వేయాలని చూసి వాళ్ళ ఇంట్లోని టివి. ఇతర ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పాప తండ్రి రాము ఈమె పై అనుమానంతో చందానగర్ పోలీసులుకు పిర్యాదు చేయగా పాప శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు పంపి, వచ్చిన రిపోర్ట్ ఆధారంగా యాదమ్మ, తల్లి తిమ్మమ్మ లను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శేరిలింగంపల్లి,శాంతినగర్ ,చందానగర్ ,పోలీస్ స్టేషన్,హాస్పిటల్ ,కృష్ణవేణి , పోస్టుమార్టం,శవాన్ని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *