మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
విద్యార్థుల ఆట, పాటలతో మాదాపూర్లోని మెరీడియన్ స్కూల్లో ఆదివారం జరిగిన మెరివాగంజా–2025 కార్నివాల్ సందడిగా జరిగింది. ఈ కార్నివాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారని పాఠశాల ప్రిన్సిపాల్ కరణం భవాని తెలిపారు. మెరివాగాంజ కార్నివాల్–2025 లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఓ జాతర వాతావరణాన్ని తలపించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు రోజంతా ఉత్సాహంగా గడిపారు. సవారీలు, ఇంటరాక్టివ్ బోర్డు ఆటలు, లక్కీ డ్రా విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి చదువుల్లో రాణించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాసంస్థల ఫౌండర్ బుట్టా రేణుక తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…