మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ కాలనీ, నాగులమ్మ గడ్డ, రాఘవేంద్ర కాలనీ, సారాయి, భకత్ గల్లి, వెంకటేశ్వర కాలనీలలో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు రంజాన్ కిట్లు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ మాద్రి పృథ్వీరాజ్ 8 సంవత్సరాలుగా ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ, పండుగల సందర్భంలో పేదల ముఖాల్లో ఆనందం నింపుతున్నారని పలువురు కొనియాడారు .దసరా, క్రిస్మస్, రంజాన్ వంటి పర్వదినాలను కులమతాలకు అతీతంగా జరుపుకుంటూ, సమాజంలో ఐక్యతను పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
