మహిళల సాంస్కృతిక ప్రతిభకు బీఆర్‌ఎస్ పెద్దపీట

politics Telangana

భారతి నగర్ డివిజన్‌లో ఘనంగా రంగోలి పోటీలు

పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :

భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి కాలనీలో ఉన్న బీ పార్క్ మరియు వివేకానంద పార్క్ లలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన రంగోలి పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఏర్పాటు చేయగా, ఆమె ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళల సాంస్కృతిక సంప్రదాయాలు, కళా నైపుణ్యాలను ప్రోత్సహించడంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. మహిళల ఐక్యత, సాంస్కృతిక విలువలను కాపాడే కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

రంగోలి పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ కళా ప్రతిభతో ఆకట్టుకున్నారు. రంగుల సమన్వయం, సంప్రదాయ నమూనాలు, సందేశాత్మక చిత్రాలతో పార్కులు కళాకాంతులతో మెరిసాయి. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా సర్కిల్ అధ్యక్షురాలు శ్రీమతి రాణి యాదవ్,రామస్వామి, మాజీ కౌన్సిలర్ నాగమణి, మహిళా బీఆర్‌ఎస్ నాయకులు స్వర్నలత, లక్ష్మి, అనిత, ఫాతిమా, రాధ, సునీత, బేబీ, అరుణ జ్యోతి, పద్మ, విజయలక్ష్మి, నస్రీన్, గాయత్రి, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *