Telangana

లంచం కొట్టు అదనపు అంతస్థులు కట్టు

_శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ లలో జోరుగా అక్రమ నిర్మాణాలు

– అక్రమ నిర్మాణదారులకు కొమ్ముకాస్తున్న అధికారి, చైన్ మెన్ లు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

కంచే చేను మేసిన చందంగా అక్రమ నిర్మాణాలను ఆపాల్సిన అధికారే అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ అందయానికి గండీ కొడుతూ అందినకాడికి దండుకొంటున్నాడనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో గల శేరిలింగంపల్లి, కొండాపూర్ డివిజన్ ల పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ, బి, సి, బ్లాకుల్లోను, రాఘవేంద్ర, రాజరాజేశ్వరి కాలనిల్లో కేవలం రెండు, మూడు అంతస్థులకు అనుమతులు తీసుకొని నాలుగు, నుండి ఏడు ఆ పైన పెంట్ హౌస్ లు నిర్మిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న అక్రమ నిర్మాణం దారుల ఆగడాలకు అంతే లేకుండా పోయింది. వీటిని నిర్మూలిoచాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే చైన్ మెన్లు లక్షల రూపాయల లంచం పుచ్చుకొని అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్కిల్ మొత్తానికి ఒక్కరే సెక్షన్ అధికారం ఉండడంతో చైన్ మెన్లు కలిసి లంచాలకు తెరలేపి అక్రమ నిర్మాణాలకు వంతపాడుతూ లక్షలు వెనుకేసుకుంటూ ప్రభుత్వ ఆధాయానికి గండి కొడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

చర్యలు తీసుకుంటారా ?

ఈ వ్యవహారం పై ద్రుష్టి సారించిన జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం రోజు నోడల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తక్షణమే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అదేశించారు. కానీ ముందే ముడుపులు పుచ్చుకున్న అవినీతి అధికారులు అందరిపై చర్యలు తీసుకుంటారా లేకపోతే బడా బాబులను వదిలేసి చిన్న, చిన్న వారిపై తూ తూ మంటూ కంటి తుడుపు చర్యలతో సరిపెడతారా అనేది వేచి చూడాలి అంటున్నారు స్థానికులు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

8 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

8 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

8 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

8 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

8 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago