13న పటాన్చెరులో బోనాల పండుగ

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్చెరు పట్టణంలో ఈనెల 13వ తేదీ గురువారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై మంగళవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత రెండు సంవత్సరాలుగా ఆదివారం, సోమవారం నిర్వహిస్తున్న పండుగను పట్టణ ప్రజల విజ్ఞప్తి మేరకు ఒకే రోజున నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. 13వ తేదీన నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున అన్ని దేవాలయాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పిటిసి జైపాల్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపానా దేవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *