బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక

Hyderabad politics Telangana

ఫలహారం బండి ఊరేగింపు లో పాల్గొన్న శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు

పటాన్చెరువు పట్టణంలో బోనాల పండుగ, ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటాయి. జిఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయం నుండి చేపట్టిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ తీన్మార్ స్టెప్పులు వేసి అందరి లో ఉత్సాహం నింపారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగను అధికార పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు. ప్రపంచంలోని నలుమూలలా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందన్నారు.

అనంతరం పట్టణంలోనీ ఏడు గుల్ల పోచమ్మ దేవాలయం, యాదవుల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీఐ వేణుగోపాల్రెడ్డి, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, విజయ్ కుమార్, యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *