దుబాయ్ ఆజ్మాన్ లో బతుకమ్మ సంబరాలులో పాల్గొన్న : బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

దుబాయ్ ఆజ్మాన్ లో ఇండియన్ పీపుల్స్ ఫోరం” తెలంగాణ కౌన్సిల్ టీం వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా  నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను  బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు . దుబాయ్ లోని ఆజ్మాన్ వేదికగా ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపిఎఫ్ దుబాయ్ ) అధ్యక్షుడు ప్రదీప్ కుమార్ గారి ఆహ్వానం మేరకు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు దేశంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారంతా ఐక్యమత్యంగా ఉండి  సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్న మన తెలంగాణ ఆడపడుచులకు శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేశారు మన తెలంగాణ సాంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేసారని వారిని అభినందించారు .ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సన్మానించిన (IPF) సంస్థ వారికి కృతజ్ఞతలు ,  దసరా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో (ఐపిఎఫ్ దుబాయ్ ) అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, జనరల్ సెక్రెటరీ శివకుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నవనీత్ గాజా, తెలంగాణ కౌన్సిల్ కన్వీనర్ మహేందర్ రెడ్డి కుంబాల, కో కన్వీనర్ శరత్, జనరల్ సెక్రటరీ దీపికా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *