_జూలై 21, 22 తేదీల్లో నిరసనల్లో పాల్గొనాలి. కాంగ్రెస్ క్యాడర్ కు ఉత్తమ్ పిలుపు
మనవార్తలు ,హైదరాబాద్:
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలతో కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకు నిరసనగా ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే దేశవ్యాప్త నిరసనలో పాల్గొనాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పంపిన సమన్లకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూలై 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లనున్నారని ఆయన తెలిపారు.
మంగళవారం జూమ్ యాప్ ద్వారా విలేకరుల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి బిజెపి ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను వాడుకుంటుందని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన మనీలాండరింగ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీని ప్రశ్నించడానికి ఈడీ లేదా మరే ఇతర కేంద్ర ఏజెన్సీకి ఎటువంటి ఆధారం లేదని ఆయన అన్నారు. నేషనల్ హెరాల్డ్ ఇష్యూ అనేది డబ్బు లావాదేవీలు లేకుండా ఒక సాధారణ రుణం-ఈక్విటీ మార్పిడి అని ఆయన వివరించారు. లావాదేవీలో డబ్బు ప్రమేయం లేనందున, మనీలాండరింగ్ అనే ప్రశ్న తలెత్తదని ఆయన అన్నారు.
నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, కాంగ్రెస్ క్యాడర్ను దిగజార్చేందుకు, ద్రవ్యోల్బణం, భారత్లోకి చైనా చొరబాటు తదితర వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉపయోగిస్తోందని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -ఈక్విటీకి మార్పిడి అనేది రుణాలిచ్చే బ్యాంకులు తరచుగా చేసే ఒక సాధారణ ప్రక్రియ అని, గతంలో మూసివేసిన నేషనల్ హెరాల్డ్ ఇష్యూను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరగదొడిందని ఆయన విమర్శించారు.
సోనియా గాంధీని ఇబ్బంది పెట్టడాన్ని కాంగ్రెస్ నాయకులు ఊరుకోరని ఆయన అన్నారు. ఈ శతాబ్దపు గొప్ప నాయకులలో సోనియా గాంధీ ఒకరని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నెహ్రూ-గాంధీ కుటుంబం దేశం కోసం చాలా త్యాగాలు చేసిందని అన్నారు. దేశ సమగ్రత కోసం మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలు అమరులయ్యారని అన్నారు.
60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా మద్దతు పలుకుతున్నారని ఆంధ్రప్రదేశ్ను విభజించి పెద్ద రాజకీయ త్యాగం చేశారని. ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారం కోల్పోతుందని తెలిసినా.. యువత, విద్యార్థుల ఆత్మహత్యలను ఆపడం కోసమే తెలంగాణను ఏర్పాటు చేశామని అన్నారు. సోనియాగాంధీ రాజకీయ సంకల్పమే తెలంగాణ ఆవిర్భావానికి దారి తీసిందని అందుకే ఆమెను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు తెలుపుతామని అని ఆయన అన్నారు.
యుపిఎ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో సాధారణ ప్రజల సాధికారతపై దృష్టి సారించిందని సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలను ఆధారాలు లేని కేసులో ఇరికించే కుట్ర చేస్తుందని,” అని ఆయన అన్నారు. సోనియా గాంధీకి సంఘీభావం తెలిపేందుకు 21, 22 తేదీల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున పాల్గొనాలని కాంగ్రెస్ ఎంపీ కోరారు.