పటాన్చెరు:
రామచంద్రాపురం డివిజన్ రాయసముద్రం చెరువు కట్టపైన నూతనంగా నిర్మించిన నాగులమ్మ ఆలయంలో నాగులమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపల్ రెడ్డి తో కలిసి తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భూపాల్ రెడ్డి దంపతులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వి.సింధు ఆదర్శ్ రెడ్డి, బూరుగడ్డ పుష్పనగేష్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య,కుమార్ గౌడ్, మోహన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వి.ఆదర్శ్ రెడ్డి, మల్లా రెడ్డి, లక్ష్మా రెడ్డి, సోనూ గౌడ్, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.