మనవార్తలు , శేరిలింగంపల్లి :
నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం. భిక్షపతి యాదవ్, మియపూర్ డివిజన్ మక్తా మహబూబ్ పెట్ కు చెందిన ఆర్ కె వై టీమ్ సభ్యుల తో కల్సి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఆయన నివాసంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు నిజాలను నిర్భయంగా వార్తలు రాయాలని, అందులో నవతెలంగాణ ది ప్రత్యేకమైన పాత్ర ఉందన్నారు.
ఏ పార్టీకి కోమ్ము కాయకుండా, ప్రజల కష్టాలను తెలుసుకుంటూ అధికారుల, పాలకులకు వారధిగా పని చేసి ప్రజా సమస్యలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక విలేకరి నర్సింలు ముదిరాజ్,, ఆర్ కె వై టీమ్ సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్ ఆకుల లక్మాన్ ముదిరాజ్,, జాజేరవు శ్రీను, జాజేరవు రాము, సోను కుమార్ యాదవ్, శివ, నరేష్ చారి,, రమేష్, పాపయ్య లు పాల్గొన్నారు.