మహమ్మారి సోకిన వారికి మెరుగైన వైద్యం….
– ఎమ్మెల్సీ కవిత
– కల్వరి టెంపుల్ లో కోవిడ్ ఐసోలేషన్ వార్డు ప్రారంభం
మనవార్తలు, మియాపూర్ :
హైదరాబాద్ మియాపూర్ లో కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల ఐసోలేషన్ వార్డును ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డు రోగులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
ఆపన్న సమయంలో అండగా నిలిచేందుకు ఎల్లప్పుడు ముందుంటామని కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్ కుమార్ అన్నారు. కొవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో దాదాపు 300 పడకలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇందులో యాభై పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉంటుందని చెప్పారు.కరోనాతో చికిత్స తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆహారం, మందులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కరోనా రోగితో పాటు అతనికి సహాయకులుగా ఉన్న వారికి కూడా వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో దాదాపు 12 మంది వైద్యులు, 20 మంది నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ తదితరులు లు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…