– విద్యా హై స్కూల్ లో అగ్నిమాపక పోలీసులు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
ఏవైనా అగ్నీ ప్రమాదాలు సంభవించినపుడు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని మాదాపూర్ ఫైర్ సేఫ్టీ అధికారులు అంజయ్య నగర్ లోని విద్యా హై స్కూల్ లో 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు, స్కూల్ సిబ్బంది కి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమర్జెన్సీ ఎగ్జైట్ నుండి ఎలా తప్పించుకోవాలి, లిఫ్ట్ వాడకుండా మెట్ల మార్గం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎలా బయట పడాలో అధికారులు మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. అధైర్య పడకుండా తాము తప్పించుకోవడమే కాకుండా ఇతరులను కూడా ఎలా రక్షించాలో, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే విషయాన్ని చక్కగా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ త్రిమూర్తులు పొన్నాడ, మాదాపూర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్: డి.ఆంజనేయులు,, స్టేషన్ ఆఫీసర్ పి.అమరేందర్, కిషోర్ కుమార్, దేవేందర్, సూర్యప్రకాష్, టీమ్, మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
