సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించి..ప్రపంచానికి ప్రజాస్వామ్య దేశాన్ని అందించిన మహోన్నత నాయకుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సొంత నిధులతో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గురువారం గాంధీ జయంతి రోజున ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన […]

Continue Reading

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన భారతీయ ఐక్యత, ప్రగతిని ప్రదర్శించేందుకు భారతీయులంతా కలిసి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించేందుకు భారతీయ అమెరికన్ కమ్యూనిటీ, న్యూయార్క్ నగరంలోని భారత కాన్సులేట్ జనరల్ మద్దతుతో న్యూజెర్సీలోని న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం పిలుపునిస్తోంది. న్యూజెర్సీలోని శ్రీ శివ విష్ణు ఆలయం (సాయి దత్త పీఠం) ఈ ‘వికసిత భారత్ రన్ ను ఘనంగా […]

Continue Reading

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తామని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శనివారం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బాపూజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను, ఆశయాలను భవిష్యత్తు […]

Continue Reading

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు.కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని బాపూజీ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మూడు తరాలపాటు అలుపెరగని పోరాటం […]

Continue Reading

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

– జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి : పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లని సమీ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ లయన్ కోడె సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కే. సుచరిత లు అన్నారు, చందానగర్ లోని శ్రీ విద్యా మందిర్ హై స్కూల్ లో నిర్వహించిన రెండురోజుల ఫ్యూజన్ ఫెస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ను వారు ముఖ్యఅతిథిగా […]

Continue Reading

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరాహార దీక్ష పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి నెరవేర్చాలని ఎన్ పిఆర్ డి డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి ప్రభుత్వంను డిమాండ్ చేశారు.వికలాంగుల పెన్షన్ రూ 6వేల కు పెంచడంతోపాటు, కొత్త పెన్షన్స్ మంజూరు […]

Continue Reading

గీతంలో ఘనంగా హౌస్ కీపర్స్ వారోత్సవాలు

పలు పోటీల విజేతలకు బహుమతులు ఉత్తమ పనితీరుకు అవార్డుల ప్రదానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఆతిథ్య విభాగం సెప్టెంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు అంతర్జాతీయ హౌస్ కీపర్స్ వారోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించింది. ప్రాంగణాన్ని పచ్చగా, పరిశుభ్రంగా, ప్రతిరోజూ స్వాగతించేలా చేసే వెలుగులోకి రాని హీరోలయిన హౌస్ కీపింగ్ సిబ్బంది అంకితభావం, కృషిని గుర్తించి, వారిని సముచిత రీతిలో సత్కరించింది.తరచుగా తెరవెనుక పనిచేసే హౌస్ కీపింగ్ నిపుణులు ప్రాంగణంలో […]

Continue Reading

రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో పెరిగిన హుండీ ఆదాయం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ​రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగింది. వినాయ‌క చ‌వితి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా 78 రోజుల హుండీ ఆదాయం 25 ల‌క్ష‌ల 61 వేల 569 రూపాయ‌ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు . ​హుండీ ఆదాయంలో భాగంగా స్వామివారి హుండీ ద్వారా 24 ల‌క్ష‌ల 46 వేల 712 రూపాయ‌లు, అన్న‌దానం హుండీలో ల‌క్ష 14 వేల‌857 […]

Continue Reading

పటాన్చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు

200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఎంపీ రఘునందన్ రావు కితాబు నవ సమాజ నిర్దేశకులు గురువులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఒక దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుందని అలాంటి గురువులను గత 24 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకల ద్వారా […]

Continue Reading

వినూత్న పరిష్కారాలతో విధాన నిర్ణయాలు

కౌటిల్య కాలోక్వీలో నిపుణుల సూచన విజయవంతంగా ముగిసిన పబ్లిక్ పాలసీ వార్షిక సమావేశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజా విధానాన్ని రూపొందించడంలో అంతర్-విభాగ విధానాలు, వినూత్న పరిష్కారాలు, సహకార ప్రయత్నాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) మూడో వార్షిక సమావేశాన్ని ‘కౌటిల్య కాలోక్వీ’ పేరిట శనివారం విజయవంతంగా నిర్వహించింది. ‘అస్థిర, అనిశ్చిత, సంక్లిష్టమైన, అస్పష్టమైన (వీయూసీఏ) ప్రపంచం ద్వారా మార్గనిర్దేశనం’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ, […]

Continue Reading